వాళ్ల ఆనందం...
దేవుని కన్నుకుట్టిందేమో....
వాళ్ల పరవశం....
ప్రకృతి కుళ్లుకుందేమో....
ఫలితం.... ఒక
దారుణం
*****
చదువులమ్మ చల్లని
ఒడిలో నిద్రించాల్సినవాళ్లు
మృత్యుకౌగిలిలో
నిర్జీవులై పడున్నారు....
చిరకాల గుర్తులుగా
ఉంచుకోవాల్సినవాళ్లు
చివరి గుర్తులుగా
మిగిలారు.....
చుట్టున్న అందమైన
లోకంలో విహరిస్తూ
అందరాని లోకానికి
వెళ్లిపోయారు....
*****
ఇరవైఐదు సంవత్సరాల
ప్రాయంలో
నూరేళ్లు
నిండాయేమో....
మృత్యువు తమని
కబళిస్తుందని తెలిసి
ఆ పసి హృదయాలు
ఎంతగా తల్లడిల్లాయో....
ఎవరైనా తమని
రక్షిస్తారని
ఎంతగా
ఎదురుచూశాయో....
ఆ చీకటి ప్రవాహంలో
చివరి శ్వాసవరకు
ఎంతగా రోదించాయో.....
*****
కళ్లముందే
సన్నిహితుల్ని జలప్రళయం మింగేస్తున్న
ఏంచేయలేని నిస్సహాయ
పరిస్థితి నరకంకాక మరేమిటి...
ఇలాంటి అనుభవం
పగవారికి కూడా రాకూడదు ఏనాటికీ..... ప్రణయ్. (12.06.2014)
(10.06.2014. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో జరిగిన సంఘటనకు చలించి)
No comments:
Post a Comment